జుక్కల్ లో హై లెవల్ వంతెన ప్రారంభం
NEWS Jul 07,2025 10:47 am
కామారెడ్డి జిల్లా జుక్కల్లో హైలెవల్ వంతెనను ప్రారంభించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రూ.4.86 కోట్లతో మద్దెలచెరువు, పిట్లం రహదారిపై వంతెన నిర్మాణం చేపట్టారు. ఈ సందర్బంగా తమ సర్కార్ యుద్ద ప్రాతిపదికన రోడ్లు, వంతెనల నిర్మాణం చేపట్టడం జరుగుతోందని చెప్పారు. ఇప్పటికే తమ శాఖలో పదోన్నతులు కల్పించామన్నారు.