ఉమ్మడి 10 జిల్లాలకు కాంగ్రెస్ ఇంచార్జ్లు
NEWS Jul 07,2025 10:43 am
తెలంగాణలోని ఉమ్మడి 10 జిల్లాలకు ఇంచార్జ్లను నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. ఖమ్మం జిల్లాకు వంశీ చందర్ రెడ్డి, నల్లగొండకు సంపత్ కుమార్, వరంగల్ కు అడ్లూరి లక్ష్మణ్ , మెదక్ జిల్లాకు పొన్నం ప్రభాకర్ , హైదరాబాద్ కు జగ్గా రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు కుసుమ కుమార్, ఆదిలాబాద్ జిల్లాకు అనిల్ యాదవ్, కరీంనగర్ జిల్లాకు అద్దంకి దయాకర్ , నిజామాద్ జిల్లాకు అజ్మత్ హుస్సేన్ , రంగారెడ్డి జిల్లాకు శివ సేనారెడ్డిని నియమించింది.