మత్తు పదార్థాలకు బానిసలు కావద్దు: సీఐ
NEWS Jul 07,2025 07:57 am
ప్రకాశం జిల్లా ఎస్.పురం (మం) చింతపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పామూరు సీఐ భీమా నాయక్ మాదకద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మత్తు పదార్థాలకు, చెడు వ్యసనాలకు విద్యార్థులు దూరంగా ఉండాలన్నారు. ఎవరైనా ఆకతాయిలు వెంటపడి వేధిస్తే వెంటనే ఆ సమాచారాన్ని పోలీసులకు అందజేయాలని బాలికలకు సూచించారు. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలన్నారు.