కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం సృష్టించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇద్దరు మరణించారని సర్కార్ తెలిపింది. 383 మందిని పర్యవేక్షణలో ఉంచామని , 16 మందిని ఆస్పత్రిలో చేర్చామని తెలిపారు వైద్య మంత్రి వీణా జార్జ్. ప్రజలు తీసుకునే ఆహారం నుండి నిఫా వైరస్ వ్యాపిస్తుందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.