చంద్రబాబు అధ్యక్షతన SIPB సమావేశం
NEWS Jul 07,2025 04:14 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర రాజధాని అమరావతిలోని సచివాలయంలో నేడు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (SIPB) సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో పెట్టుబడి ప్రతిపాదనలు, ఉద్యోగావకాశాలు, పరిశ్రమల అభివృద్ధిపై చర్చించే అవకాశం ఉంది. మంత్రులు, అధికారులు హాజరవుతారు.