ఏబీఎన్, ఆంధ్రజ్యోతిని బహిష్కరించాలి
NEWS Jul 07,2025 03:22 am
తెలంగాణలో ఉంటూ ఆంధ్ర పాట పాడుతూ చంద్రబాబును వెనకేసుకు వస్తున్న ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్ ఛానెల్ ను తెలంగాణ ద్రోహుల మీడియాగా బహిష్కరించాలని బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు లేఖ రాశారు. ఈ మేరకు కీలక ప్రకటన విడుదల చేశారు. గత కొంత కాలంగా కావాలని , పనిగట్టుకుని బీఆర్ఎస్ పై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఇక నుంచి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించ పరిచేలా ఎవరు మాట్లాడినా ఊరుకునేది లేదని హెచ్చరించారు.