టీమిండియా గ్రాండ్ విక్టరీ
NEWS Jul 06,2025 09:49 pm
ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా 336 పరుగులతో ఘన విజయం సాధించింది. 608 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు.. భారత బౌలర్ల ధాటికి 271 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా బౌలర్లలో ఆకాశ్ దీప్ 6 వికెట్లు తీసి.. కేరీర్లోనే అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. మిగతా బౌలర్లు తలా ఒక వికెట్ తీశారు. ఐదు టెస్టుల సిరీస్లో చెరో మ్యాచ్ గెలవడం ద్వారా 1-1తో సిరీస్ సమమైంది.