అన్ని రిజర్వాయర్లను నింపాలి - సీఎం
NEWS Jul 06,2025 08:09 pm
ఏపీలోని అన్ని రిజర్వాయర్లను నింపాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రతి నీటి చుక్కను వృధా చేయకుండా కాపాడు కోవాలని సూచించారు. ఆయా ప్రాజెక్టుల కింద పెద్ద ఎత్తున రైతులు సాగు చేస్తున్నారని, వారికి నీరందించడంపై ఫోకస్ పెట్టాలని స్పష్టం చేశారు. ఒక్క కడప జిల్లా మినహా అన్ని జిల్లాల్లో సాధారణ వర్షపాతమే ఉందన్నారు. సమగ్ర నిర్వహణ ద్వారా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వచ్చే నీళ్లను హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు ద్వారా సీమలో ప్రతి ప్రాంతానికీ తరలించి చెరువులు, కుంటలను నింపాలన్నారు.