పోటెత్తిన గోదావరి..నీట మునిగిన ఆలయాలు
NEWS Jul 06,2025 07:32 pm
మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలు నీట మునిగాయి. గోదావరి ఉప్పొంగుతోంది. నాసిక్ లోని పంచవటి ప్రాంతంలో అంతకంతకూ నీటి మట్టం పెరుగుతోంది. తీర ప్రాంతంలో ఉన్న ఆలయాలు , వంతెనలు నీట మునిగాయి. గాంగాపూర్ డ్యామ్ నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. అప్రమత్తంగా ఉండాలని మరాఠా సర్కార్ కోరింది.