శ్యామా ప్రసాద్ జీవితం స్ఫూర్తిదాయకం
NEWS Jul 06,2025 08:55 pm
జగిత్యాల జిల్లా మల్యాలలో బీజేపీ ఆధ్వర్యంలో జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మొక్కలు నాటారు. శ్యామ ప్రసాద్ ఆలోచన విధానాలు ముందు చూపుకు నిదర్శనమని, ఆయన జీవితం దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకమన్నారు బీజేపీ మండలాధ్యక్షుడు గాజుల మల్లేశం. ఈ కార్యక్రమంలో వెంకటస్వామి యాదవ్, సంఘని రవి, బొట్ల ప్రసాద్, లత, గోవర్ధన్, రాములు, కిషన్, జీవన్, డానియల్, దేవరాజ్తదితరులు పాల్గొన్నారు.