వెంకన్న స్వామికి మాజీ ఎమ్మెల్యే పూజలు
NEWS Jul 06,2025 09:00 pm
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో తొలి ఏకాదశి సందర్భంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు సిహెచ్.రమేష్, మండల నాగేంద్ర వెంకటరెడ్డి, సిద్ధయ్య, డివి.రమణ, నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.