అమరావతిలో CBI ఆఫీసుకు భూకేటాయింపు
NEWS Jul 06,2025 03:20 am
అమరావతిలో సీబీఐ కార్యాలయ నిర్మాణం చేపట్టనున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 50వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో సీబీఐ ఆఫీసుకు భూమి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సీబీఐతో పాటు జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ, ఎంఎస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీ, కిమ్స్ సహా 16 సంస్థలకు 65 ఎకరాల మేర భూ కేటాయింపులకు ఆమోదం తెలిపారు.