నేడు తొలి ఏకాదశి పర్వదినం
NEWS Jul 06,2025 01:58 am
తొలి ఏకాదశి పర్వదినం సందర్బంగా తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయాల వద్ద బారులు తీరారు. దీనిని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఇవాళ్టి నుంచి విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళతారని భక్తుల నమ్మకం. ఈ పర్వదినాన మహిళలు ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.