వీఆర్వో, వీఆర్ఎలకు మళ్లీ అర్హత పరీక్ష
NEWS Jul 05,2025 10:28 pm
హైదరాబాద్: ప్రతి రెవెన్యూ గ్రామానికి గ్రామ పరిపాలనా అధికారి ఉంటారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా గ్రామ పరిపాలనా అధికారుల నియామకాన్ని చేపట్టినట్లు చెప్పారు. వీఆర్వో, వీఆర్ఎలుగా పని చేసినవారికి జీపీవోలుగా అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక పరీక్ష ద్వారా 3,454 మంది అర్హత సాధించారని వెల్లడించారు. రెవెన్యూ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు వీఆర్వో, వీఆర్ఎలకు మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. అర్హత పరీక్ష త్వరలోనే నిర్వహిస్తామన్నారు.