వ్యవసాయ కార్పొరేటీకరణను అడ్డుకోవాలి
NEWS Jul 06,2025 08:59 am
వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరించే ప్రయత్నాలను అడ్డుకోవాలని ఆల్ ఇండియా కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులు, రాజస్థాన్ కు చెందిన ఎంపీ ఆమ్రారామ్ పిలుపునిచ్చారు. ఏపీ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలులో నిర్వహించిన కార్పొరేటీకరణ వ్యవసాయ రంగంపై ప్రభావం అంశంపై సెమినార్ లో ఎంపీ మాట్లాడారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలుకు హామీ ఇచ్చిన ప్రధాని మోడీ.. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. నల్ల చట్టాలను అమలు చేస్తున్నారని విమర్శించారు