మచిలీపట్నం: గుర్తు తెలియని వ్యక్తి మృతి
NEWS Jul 06,2025 12:17 am
మచిలీపట్నం జైహింద్ హైస్కూల్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి శనివారం ఉదయం మృతి చెందాడు. పెద్దపులి పంజా ఎదురుగా రోడ్డు పక్కన మృతి చెందిన ఉన్న వ్యక్తిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుని వయసు సుమారు 50 సంవత్సరాలు ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. మృతుని వివరాల తెలిసిన వారు ఇనగుదురు పోలీస్ స్టేషన్ లో తెలియజేయాలన్నారు.