చరిత్రలోనే భారీ బడ్జెట్ మూవీ 'రామాయణం'
NEWS Jul 05,2025 10:37 am
రణబీర్ కపూర్, యష్ నటిస్తున్న 'రామాయణం' చిత్రం భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్గా నిలిచింది. ఈ 2 భాగాల చిత్ర ఫ్రాంచైజీ బడ్జెట్ రూ. 1600 కోట్లు. మొదటి భాగానికి రూ. 900 కోట్లు, రెండో భాగానికి రూ. 700 కోట్లు ఖర్చు చేస్తున్నారు. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2026 దీపావళికి పార్టు-1, 2027 దీపావళికి పార్టు-2 సందర్భంగా విడుదల కానుంది. ఈ భారీ బడ్జెట్తో రామాయణం గ్లోబల్ స్థాయిలో సంచలనం సృష్టించనుంది.