వైసీపీ శ్రేణుల వినూత్న నిరసన
NEWS Jul 05,2025 09:10 am
నర్సీపట్నం-భీములి రహదారి దుస్థితిపై వడ్డాదిలో వైసీపీ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. వైస్ ఎంపీపీ దొండా లలిత నారాయణమూర్తి ఆధ్వర్యంలో బురదమయమై రోడ్లపై మొక్కలు నాటి నిరసన తెలిపారు. రోడ్లు గుంతలమయంగా మారడంతో వాహనదారులు ప్రమాదల బారిన పడుతున్నారన్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు కొల్లుమల్ల అచ్చం నాయుడు, కోవెల జనార్ధన్, ఎంపీటీసీ రమణ, తదితరులు పాల్గొన్నారు.