శ్రీశైలంలో ఉచిత స్పర్శ దర్శనానికి టోకెన్లు
NEWS Jul 05,2025 08:48 am
మల్లన్న భక్తులకు తీపి కబురు చెప్పింది సర్కార్. ఇక నుంచి శ్రీశైలంలో ఉచిత స్పర్శ దర్శనానికి టోకెన్లు జారీ చేస్తామని తెలిపారు ఈవో. ఒకరోజు ముందే టోకెన్లు తీసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ టోకెన్లను మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఇస్తామన్నారు. మధ్యాహ్నం 1:45 నుంచి 3:45 గంటల వరకు ఉచిత స్పర్శ దర్శనం ఉంటుందని తెలిపారు.