ఇసుక ట్రాక్టర్ను సీజ్ చేసిన తహశీల్దార్
NEWS Jul 05,2025 05:43 am
కథలాపూర్ మండల కేంద్రంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను అర్ధరాత్రి సీజ్ చేశారు రెవెన్యూ సిబ్బంది. ఇసుకను అక్రమంగా తరలించడం నేరమని.. ప్రతి ఒక్కరూ డీడీలు తీసి ఇసుకను తీసుకెళ్లాలని తహశీల్దార్ వినోద్ కుమార్ సూచించారు. ఎన్నిసార్లు చెప్పినా ట్రాక్టర్ యాజమానులు పట్టించుకోవడం లేదని.. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.