పూడిమడక: ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం
NEWS Jul 05,2025 10:41 am
పూడిమడక గ్రామ కడపాలెంలో “ఇంటింటికి తెలుగుదేశం – సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమం ప్రారంభమైంది. మాజీ సర్పంచ్ మేరుగు బాపు నాయుడు నాయకత్వంలో, ఎలమంచిలి నియోజకవర్గ ఇన్చార్జి ప్రగడ నాగేశ్వరరావు సూచనలతో కార్యక్రమం జరిగింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. తల్లికి వందనం, దీపం పథకం, ఎన్టీఆర్ భరోసా, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను హైలైట్ చేశారు. గ్రామ అధ్యక్షుడు మేరుగు వెంకట్రావు, సంపంగి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.