రోడ్లపై చెత్త వేస్తే జరిమానా
- కమిషనర్ ఆకుల వెంకటేష్
NEWS Jul 04,2025 02:39 pm
పెద్దపల్లి పట్టణ ప్రజలు దుకాణ యజమానులు రోడ్లపై చెత్త వేస్తే జరిమానాలు తప్పవని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ హెచ్చరించారు. ఈరోజు రోడ్డుపైన చెత్త వేసినందుకు గాను ఓ దుకాణ యజమానికి రూ. 3,000 జరిమానా విధించారు. పర్యవేక్షణలో జూనియర్ అసిస్టెంట్లు రమాకాంత్, ప్రదీప్ వార్డ్ ఆఫీసర్ అరవింద్, సానిటరీ ఇన్స్పెక్టర్ పులిపాక రాజు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.