ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుక్రవారం మార్కాపురంలో జల్ జీవన్ మిషన్ పథకం శంకుస్థాపనకు విచ్చేస్తున్న సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లపై ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ సిబ్బందికి సూచనలు చేశారు. రాకపోకలకు ఇబ్బంది కలగకుండా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. నరసింహపురంలో జరిగే వేదిక సంబంధించి కాన్వయ్ వెళ్లే మార్గాన్ని పరిశీలించారు.