తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
NEWS Jul 03,2025 11:30 am
తెలంగాణలో రుతుపవన ద్రోణి ప్రభావంతో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది . హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ సహా 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.