ఎమ్మెల్యే అనిరుధ్ పై టీపీసీసీ ఆగ్రహం
NEWS Jul 03,2025 11:31 am
కాంగ్రెస్ లో కోవర్టులు ఉన్నారంటూ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తను చేసిన కామెంట్స్ ను తీవ్రంగా పరిగణిస్తున్నామని అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. క్రమశిక్షణ విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు పార్టీ లైన్ దాట వద్దని సూచించారు. ఇప్పటికే ఈ విషయాన్ని పలుమార్లు చెప్పామన్నారు.