బనకచర్లతో ఎవరికీ నష్టం లేదు - సీఎం
NEWS Jul 03,2025 09:25 am
బనకచర్ల ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం జరగదని మరోసారి స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. కొందరు అనవసరంగా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. వృథా అవుతున్న గోదావరి నీళ్లు వాడుకోవాలన్నదే మా ఉద్దేశం తప్ప మరోటి కాదన్నారు. ప్రతి ఏటా సగటున 2 వేల టీఎంసీల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని తెలిపారు. అవి వృథాగా వెళ్లకుండా బనకచర్ల ప్రాజెక్టుకు వాడుకునేందుకు శ్రీకారం చుట్టామన్నారు. ఎగువ ఉన్న తెలంగాణ వాళ్లు ప్రాజెక్టులు కట్టుకుంటే తాను ఎన్నడూ అభ్యంతరం చెప్పలేదన్నారు.