తప్పుడు ప్రచారాలను ఖండించిన బాబు
NEWS Jul 03,2025 06:51 am
కుప్పంలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఖండించారు. కొందరు రాజకీయ నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం.. ప్రజలను మోసం చేసేందుకు అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలపై నిజాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు. రాష్ట్ర ప్రగతికి అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.