మాజీ సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో జగన్ ఐదేళ్ల పాలనలో చేసిన పని ప్రజలను మోసం చేయడమే అని వివర్శించారు. వైసీపీ పాలనలో దెబ్బతిన్న రాష్ట్రాన్ని ఈ ఏడాదిలోనే గాడిన పెట్టామన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగిస్తున్నారని తెలిపారు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి.