జరుగుమల్లిలో మంత్రి, ఎంపీ పర్యటన
NEWS Jul 03,2025 12:29 pm
“సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమంలో భాగంగా జరుగుమల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి డాక్టర్ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వారు ప్రజలకు వివరించారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మారిటైం బోర్డు చైర్మన్ సత్య, తదితరులు పాల్గొన్నారు.