లిక్కర్ స్కామ్లో నేడు మరోసారి విచారణ
NEWS Jul 03,2025 04:26 am
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నేడు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన సన్నిహితుడు వెంకటేష్ నాయుడిని సిట్ మరోసారి విచారించనుంది. విజయవాడలోని సిట్ కార్యాలయంలో జరిగే ఈ విచారణలో రూ.3,200 కోట్ల అవినీతి ఆరోపణలపై కీలక ప్రశ్నలు సంధిస్తారు. మూడు రోజుల కస్టడీ ముగియనుండగా, ఇద్దరినీ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు.