ఏసీబీ విచారణకు IAS అరవింద్ కుమార్
NEWS Jul 03,2025 04:23 am
హైదరాబాద్లో జరిగిన ఫార్ములా-ఈ రేస్ కేసులో సీనియర్ IAS అధికారి అరవింద్ కుమార్ను నేడు ఏసీబీ విచారణకు హాజరుకానున్నారు. రూ.54.88 కోట్ల అవినీతి ఆరోపణలపై ఆయన నాలుగోసారి విచారణ ఎదుర్కొంటున్నారు. కేటీఆర్ ఆదేశాల మేరకు నిధులు బదిలీ చేసినట్లు ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కేసులో కేటీఆర్, బీఎల్ఎన్ రెడ్డి కూడా నిందితులుగా ఉన్నారు.