కేంద్రం తీరుపై విజయశాంతి ఆగ్రహం
NEWS Jul 03,2025 02:07 am
కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ ఆలస్యంపై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ సందర్శనల్లో ప్రధాని, కేంద్ర మంత్రులతో చర్చించినా ఫలితం లేదన్నారు. కేంద్రం నిర్లిప్త వైఖరి వల్ల తెలంగాణ ప్రజల్లో అనుమానాలు కలుగుతున్నాయని, వెంటనే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.