4న కాంగ్రెస్ బహిరంగ సభ ..ఖర్గే రాక
NEWS Jul 02,2025 01:29 pm
ఈనెల 4న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభను నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా ఏఐసీసీ చీఫ్ ఖర్గే హాజరవుతారు. ఈ సందర్బంగా సభా ఏర్పాట్లను పరిశీలించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఈ సభను విజయవంతం చేయాలని భట్టి పిలుపునిచ్చారు.