140 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలైన వల్లభనేని వంశీ
NEWS Jul 02,2025 11:59 am
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 140 రోజుల జైలు జీవితం తర్వాత విడుదలయ్యారు. ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో నుజ్విడ్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన విజయవాడ జైలు నుంచి బయటకు వచ్చారు. గతంలో సత్యవర్ధన్ కిడ్నాప్, టీడీపీ కార్యాలయ దాడి కేసుల్లోనూ బెయిల్ పొందారు.`