అలా చేస్తే తల్లిదండ్రులు జైలుకే: గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్
NEWS Jul 03,2025 12:33 pm
పాఠశాలలు, కళాశాలలు వెళ్లే పిల్లలకు తల్లిదండ్రులు ద్విచక్ర వాహనాలు ఇచ్చి పంపిస్తే కఠిన చర్యలు తప్పవని గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్ హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలపై సీఐ మాట్లాడారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వవద్దని ఇటీవల ముండ్లపాడు గ్రామంలో ముగ్గురు మైనర్లు వాహనం నడిపి ఓ వ్యక్తి ప్రాణం పోయేందుకు కారణమయ్యారన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష తప్పదన్నారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు పోలీసులకు ప్రజలు సహకరించాలన్నారు.