కల్యాణి టీచర్ పాఠాలు: విద్యార్థిగా మారిన నారా లోకేశ్
NEWS Jul 02,2025 04:00 pm
ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఉండవల్లిలోని తన నివాసంలో ఉపాధ్యాయిని కల్యాణి కుమారి నుంచి తెలుగు పాఠాలు నేర్చుకున్నారు. కర్నూలు జిల్లా పట్టికొండకు చెందిన కల్యాణి, ‘షైనింగ్ టీచర్’ అవార్డు గ్రహీత. ఈ సందర్భంగా లోకేశ్, ఆమె నుంచి విద్యాబోధనలో నూతన పద్ధతులను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం విద్యా సంస్కరణల్లో భాగంగా జరిగింది.