జగన్ Z+ భద్రతపై హైకోర్టుకు వైసీపీ
NEWS Jul 02,2025 05:49 am
జగన్కు జెడ్ ప్లస్ భద్రత కల్పించడంపై హైకోర్టును ఆశ్రయించింది వైసీపీ. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకునే ప్రమాదం ఉందంటూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. రోప్ పార్టీని ఏర్పాటు చేయడం లేదని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వ తరపు న్యాయవాది తీవ్ర అభ్యంతరం తెలిపారు.