శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.97 కోట్లు
NEWS Jul 02,2025 09:28 am
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామిని 76 వేల 126 మంది దర్శించుకున్నారు. 24 వేల 720 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.97 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో. ప్రస్తుతం దర్శనం కోసం నాలుగు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని వారికి 10 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.