పాశమైలారం ఘటనలో 13 మృత దేహాలు గుర్తింపు
NEWS Jul 02,2025 08:41 am
పాశమైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీలో చోటు చేసుకున్న పేలుడు ఘటనలో ఇప్పటి వరకు 36 మంది మృతి చెందారని అధికారికంగా వెల్లడించారు జిల్లా కలెక్టర్ . ఈ ఘటనలో ఇప్పటి దాకా 13 మంది మృత దేహాలను గుర్తించామన్నారు. వీరి కుటుంబాలకు తక్షణ సాయంగా రూ. 1 లక్ష చొప్పున అందించడం జరిగిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. కోటి రూపాయల సాయం యాజమాన్యం నుంచి ఇప్పిస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి.