చానస్య గౌడ్కు మంత్రి అభినందనలు
ఐస్ స్కేటింగ్లో రెండు పతకాలు
NEWS Jul 02,2025 01:23 am
జాతీయ జూనియర్ ఐస్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్లో ఎర్రంకి చానస్య గౌడ్ (తెలంగాణ) 2 పతకాలు (రజతం, కాంస్యం) సాధించింది. డెహ్రాడూన్లో అండర్-9 బాలికల విభాగంలో చానస్య చక్కటి నైపుణ్యం ప్రదర్శించింది. క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శామీర్పేట్ స్పోర్ట్స్ స్కూల్లో చానస్యను, ఆమె తల్లిదండ్రులను, కోచ్లను అభినందించారు. తెలంగాణ స్పోర్ట్స్ హబ్గా మారుతుందని మంత్రి తెలిపారు.