ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు
NEWS Jul 01,2025 11:30 pm
ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు మల్యాల ఎస్ఐ నరేష్ కుమార్ తెలిపారు. కరీంనగర్ జిల్లా వావిలాలపల్లికి చెందిన మల్యాల ప్రశాంత్ ఓ సంస్థలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. జూన్ 27న మల్యాలలోని విశ్వబ్రాహ్మణ సంఘం వద్ద సంస్థకు చెందిన సదస్సు నిర్వహిస్తుండగా వడ్రంగి కులానికి చెందిన గోవర్ధన్, రాజేశ్వర్ అనే వ్యక్తులు అక్కడికి వెళ్లి కులం పేరుతో దూషించడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.