సింగయ్య మృతి కేసు.. జగన్కు హైకోర్టులో తాత్కాలిక ఊరట
NEWS Jul 01,2025 04:14 pm
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. పల్నాడు జిల్లాలో సింగయ్య అనే వృద్ధుడి మృతికి సంబంధించిన కేసులో ఆయనపై తదుపరి చర్యలు తీసుకోకుండా రెండు వారాల పాటు స్టే విధిస్తూ న్యాయస్థానం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.