విద్యార్థులతో కలెక్టర్ సహపంక్తి భోజనం
NEWS Jul 01,2025 05:18 pm
మద్దిపాడు మండలం గార్లపాడులోని మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలో ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలో మౌలిక వసతులపై ఆరా తీశారు. ఉపాధ్యాయులతో మాట్లాడి మెరుగైన విద్యా బోధన చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.