పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాజు
NEWS Jul 01,2025 05:12 pm
కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా బుచ్చయ్యపేట మండలం పలు గ్రామాల్లో ఎమ్మెల్యే KSNS రాజు పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ డైరీ డైరెక్టర్ సత్యనారాయణ, మండలాధ్యక్షులు కోటేశ్వరరావు, తమరాన దాసు, రవి, శ్రీరామ్మూర్తి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.