శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5.30 కోట్లు
NEWS Jul 01,2025 12:20 pm
తిరుమల పుణ్యక్షేత్రం భక్త బాంధవులతో కిటకిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామిని 78 వేల 730 మంది భక్తులు దర్శించుకున్నారు. 28 వేల 940 మంది తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5.30 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో శ్యామల రావు. ప్రస్తుతం భక్తులు 12 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని వారికి 12 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.