బుమ్రా అందుబాటులో ఉన్నాడు.. రెండో టెస్టుపై వీడని ఉత్కంఠ!
NEWS Jul 01,2025 11:21 am
ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్లో ఇప్పటికే 0-1తో వెనుకబడిన టీమిండియాకు కీలకమైన రెండో టెస్టుకు ముందు కాస్త ఊరట లభించింది. భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఎంపికకు అందుబాటులో ఉన్నట్లు జట్టు సహాయక కోచ్ ర్యాన్ టెన్ డెస్కాటే సోమవారం స్పష్టం చేశాడు. అయితే, జులై 2 నుంచి ఎడ్జ్బాస్టన్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్లో బుమ్రాను తుది జట్టులోకి తీసుకోవాలా? వద్దా? అనే విషయంపై టీమ్ మేనేజ్మెంట్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపాడు.