బనకచర్లకు అనుమతి ఇవ్వలేం - కేంద్రం
NEWS Jul 01,2025 09:05 am
ఏపీ సర్కార్ కు కోలుకోలేని షాక్ తగిలింది. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు భంగం కలిగిస్తూ 200 టీఎంసీల నీళ్లను ఎత్తుకు పోయేందుకు ప్లాన్ చేసిన పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వలేమంటూ స్పష్టం చేసింది కేంద్ర సర్కార్. ఈ మేరకు నిపుణుల కమిటీ ఈ విషయాన్ని వెల్లడించింది. బనకచర్లకు పర్యావరణ అనుమతులు లేవంటూ పేర్కొంది. ఈ ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు వచ్చాయని తెలిపింది. అనుమతి ఇవ్వాలంటే జీడబ్ల్యూడీటీ అవార్డును పరిశీలించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.