ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
NEWS Jul 01,2025 05:44 pm
కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మున్సిపల్ పరిధిలోని శంఖవరంలో అవ్వ, తాతలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పేదల పక్షపాతి అని ఆయన అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ CM చంద్రబాబు ప్రజలకు చేరువయ్యాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.