పాశమైలారం ఘటనలో 37మంది మృతి
NEWS Jul 01,2025 02:05 am
పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 37కి చేరింది. మరో 25 మంది చికిత్స పొందుతుండగా.. 57 మంది డిశ్చార్జ్ అయినట్లు సంగారెడ్డి కలెక్టర్ తెలిపారు. గుర్తుపట్టలేని మృతదేహాలు ఉండగా.. డీఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నారు. సింగరేణి టీమ్ ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. శిథిలాల కింద మరికొందరు ఉంటారని అనుమానిస్తున్నారు.