రాజాం గ్రామంలో కొండచిలువ హతం
NEWS Jul 01,2025 05:45 pm
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం రాజాం గ్రామంలో 12 అడుగుల కొండచిలువ గ్రామస్తుల చేతిలో హతమైంది. బోద వారి వీధిలో కొద్దిరోజులుగా కొండచిలువ హల్చల్ చేసింది. ఇల్లు వద్ద కోళ్లను మింగేస్తుంది. రాత్రివేళ ఈ కాలనీ వాసులు భయంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. సోమవారం రాత్రి కొండచిలువ ప్రత్యక్షం అవడంతో స్థానికులు హతమార్చారు. కొండచిలువ హతమవడంతో గ్రామస్తులంతా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు.